Current Date: 05 Oct, 2024

మదనపల్లెకు చేరుకున్న సీఐడీ చీఫ్‌ విచారణ వేగవంతం

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయ దహనం కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఏపీ సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ గురువారం మదనపల్లెకు చేరుకున్నారు. సబ్‌ కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. కేసు పురోగతిపై ఆయన సమీక్షించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాన్ని కొందరు దుండగులు ఆదివారం తగలబెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కీలక కంప్యూటర్లు, దస్త్రాలన్నీ కాలిపోయాయి. ఆదివారం రాత్రి 11.24 గంటలకు ఈ ఘటన జరిగింది. అంతకు కొన్ని నిమిషాల ముందు వరకు కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌తో పాటు పలువురు సిబ్బంది అక్కడ ఉన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో పనిచేసే ఆర్డీవో హరిప్రసాద్‌తో పాటు 37 మంది సిబ్బందిని, పూర్వ ఆర్డీవో మురళిని అదుపులో ఉంచుకుని విచారిస్తున్నారు. వారందరి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు.

Share