Current Date: 06 Oct, 2024

మాస్క్‌తో ఆఫీస్‌కి ఎమ్మెల్యే దొరికిపోయిన ఉద్యోగి

పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. స్థానికుల సమస్యలను త్వరితగతిన తీర్చడంతో పాటు ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. తెలంగాణలోని అశ్వరావు పేట నియోజకవర్గంలో పెద్దవాగు తెగిపోయి..రైతులు వరదలో చిక్కుకోవడంతో వెంటనే హెలికాఫ్టర్ పంపించి 20 మంది రైతులను ఆదుకున్నారు. ఈ ఘటన ఆయనపై ఉన్న గౌరవాన్ని ఎంతో పెంచింది. తన నియోజకవర్గం కాకపోయినా.. అసలు తన రాష్ట్రమే కాకపోయినా ఆపదలో ఉన్నారని తెలిసి స్వయంగా రంగంలోకి దిగి వారిని రక్షించి గొప్ప మనసు చాటుకున్నారు.  తాజాగా ప్రభుత్వం కార్యాలయాల్లో ప్రభుత్వ సిబ్బంది పనితీరు ఎలా ఉందొ తెలుసుకోవాలని స్వయంగా వెళ్లారు. అది కూడా ఎమ్మెల్యేలా మంది మార్భలంతో కాకుండా మాస్క్ పెట్టుకుని మారువేషంలో వెళ్లి పరివేక్షించారు. కేఆర్‌పురం ఐటీడీఏ కార్యాలయానికి ఫస్ట్ టైం బాలరాజు వెళ్లారు. ఎమ్మెల్యేను గమనించని ఉద్యోగి సాయి కుమార్ ఆఫీసు సమయంలో పని వదిలేసి తాపీగా పజ్జీ గేమ్ ఆడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబద్ధతతో ప్రజల కోసం పనిచేయాలని హితవు పలికారు.

Share