Current Date: 05 Oct, 2024

ప్రతిపక్షానికి నిర్మలా సీతారామన్ కౌంటర్

యూనియన్ ఫైనాన్స్ మంత్రి నిర్మల సీతారామన్ ప్రతిపక్షం ఆరోపణలను ఖండించారు. కేంద్ర బడ్జెట్ బీజేపీ మిత్రపక్షాలు జేడీయూ (బిహార్), టీడీపీ (ఆంధ్రప్రదేశ్)కు అనుకూలంగా ఉందని బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటానికి జేడీయూ మరియు టీడీపీపై ఆధారపడుతున్నందున, ఈ రెండు రాష్ట్రాలకు ప్రత్యేక అనుకూలత ఇచ్చినట్లు ఆరోపించింది.  ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను ఆమె తప్పుపట్టారు. బడ్జెట్ పై లోక్ సభలో జరిగిన చర్చలో, ఒక రాష్ట్రం పేరును ప్రస్తావించలేదంటే ఆ రాష్ట్రం బడ్జెట్‌లో లేనట్లు అర్థం కాదని సీతారామన్ స్పష్టం చేశారు. యూపీఏ కాలంలో కూడా 2009-10 బడ్జెట్ సమయంలో 26 రాష్ట్రాలు పేర్లలో లేవని, అలాగే 2004-05లో 17, 2005-06లో 18, 2007-08లో 16 రాష్ట్రాలు కూడా పేర్లలో లేవని వివరించారు.జూలై 23న తన ఏడవ బడ్జెట్‌ను సమర్పించిన సీతారామన్, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతికి 15,000 కోట్లు, బిహార్‌లో రోడ్డు ప్రాజెక్టుల కోసం 26,000 కోట్లు కేటాయించారు. జమ్మూ కాశ్మీర్‌కు 12,000 కోట్లు పోలీసులకు, 5,000 కోట్లు అభివృద్ధి కోసం అందించబడ్డాయని వెల్లడించారు.

Share