Current Date: 05 Oct, 2024

ఆసుపత్రి నుంచి శ్రీదేవి కూతురు డిశ్చార్జ్ వణికిపోయిందట

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. చెన్నైలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఆసుపత్రిలో అడ్మిట్ అయిన జాన్వీ కపూర్.. ఆ తర్వాత 3 రోజులకే డిశ్చార్జ్ అయ్యింది. తాజాగా దీని గురించి తను ఫ్యాన్స్‌లో పంచుకుంది. ఒక పాట షూటింగ్ కోసం చెన్నై వెళ్లాను. అక్కడికి వెళ్లినప్పుడు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల కడుపులో నొప్పి మొదలయ్యింది.    మొదట కడుపులో నొప్పిగా అనిపించినా మెల్లగా దాని వల్ల నీరసం కూడా వచ్చింది. భరించలేనంత నొప్పి, వణుకు రావడంతో అసలు తనకు ఏమైందో అని భయపడిపోయా. చెన్నై నుండి హైదరాబాద్‌కు ఫ్లైట్ ఎక్కే ముందు పరిస్థితి చూసి పక్షవాతం వచ్చిందేమో అని భయపడ్డా. మనం అన్నింటికంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనే విషయాన్ని తాను అర్థం చేసుకున్నాను. ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు మళ్లీ డ్యాన్స్ చేయగలనో లేదో అని భయంలోనే ఉండిపోయా. ఇప్పుడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి వర్క్‌లో బిజీ అవుతున్నా కూడా పూర్తిగా ఓపిక లేదు అని చెప్పుకొచ్చింది జాన్వీకపూర్

Share