Current Date: 05 Oct, 2024

ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీని 1వతేదీ ఉ.6గం.లకే ప్రారంభించాలి

ఆగస్టు నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ. 2737.41కోట్ల ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  64.82లక్షల మంది కి ఆగష్టు 1 ఉ. 6గంటలకు నుంచే పెన్షన్ల పంపిణీ ని ప్రారంభించాలని సీఎస్ నీరబ్ కుమార్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.  గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి 1వ తేదీన 96శాతం పంపిణీ, 2వ తేదీతో నూరు శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వృద్ధులు, వితంతువులకు రూ. 4వేలు, దివ్యాంగులకు రూ. 6వేలు అందనున్నాయి. ఫించన్ల పంపిణీ ప్రక్రియలో జిల్లా కలక్టర్లు పాల్గొనాలి.ఫించన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించండి. గత నెలలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.

Share