జై షా స్థానంలో ఆసియా క్రికెట్ మండలికి కొత్త అధ్యక్షుడు...
Dec 07, 2024
జై షా స్థానంలో ఏసీసీ అధ్యక్షుడుగా శ్రీలంక క్రికెటర్ షమ్మీ సిల్వా బాధ్యతలు స్వీకరించారు. సిల్వా గతంలో ఏసీసీ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గానూ పని చేశారు. ఏసీసీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆసియా క్రికెట్ కౌన్సిల్కు నాయకత్వం వహించడం గొప్ప గౌరవమని పేర్కొన్నారు. క్రికెట్ అనేది ఆసియా గుండె చప్పుడని అన్నారు. క్రికెట్ అభివృద్ధికి, ప్రతిభకు అవకాశాలు అందించడానికి, అందరినీ ఐక్యంగా ఉంచడానికి సభ్య దేశాలతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నానని ఆయన పేర్కొన్నారు.