Current Date: 25 Mar, 2025

ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ

ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం 175 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ 16.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. కోల్‌కతాపై 1000 పరుగులు పూర్తిచేసుకోవడంతోపాటు నాలుగు జట్లపై 1000కిపైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.

Share