విశాఖలోని ఎంవీపీ కాలనీకి చెందిన ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ విశ్రాంతి అధికారిణి చల్లా మంజుల దాతృత్వం కనబర్చారు. తన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అచీవ్మెంట్ను ‘మానవతా మిషన్’గా మార్చారు. మహిళా మనో వికాస్ విభాగం నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా అత్యధిక సంఖ్యలో క్రోచెట్ స్క్వేర్లను రూపొందించినందుకు ప్రతిష్టాత్మక రికార్డును సాధించిన ఆమె, చతురస్ర రంగుల దుప్పట్లను అల్లి, చలితో బాధ పడుతున్న వృద్ధులకు ఉచితంగా పంపిణి చేసారు. మా ప్రేమ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో మంజుల ఈ దుప్పట్లను నిరాశ్రయులకు అందజేశారు. మంజుల ప్రయత్నాలు వ్యక్తిగత సాధనకు మించినవని, మానవాళికి సేవ చేయాలనే ఆమె అచంచలమైన నిబద్ధతను ప్రతిబింభిస్తాయని పలువురు ఈ సందర్భంగా కొనియాడారు.
Share