అనకాపల్లి జిల్లా విజయరామరాజు పేటలో రైల్వే వంతెన కుంగింది. భారీ వాహనం వంతెన కింది నుంచి వెళ్తూ గడ్డర్ను ఢీకొంది. దీంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఈ ఘటనతో విశాఖ- విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.కశింకోట వద్ద గోదావరి, విశాఖ ఎక్స్ప్రెస్లను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిలిపేశారు. ఎలమంచిలిలో మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ను నిలిపేశారు. దెబ్బతిన్న రైల్వే ట్రాక్కు సిబ్బంది మరమ్మతులు చేపట్టిన తర్వాత.. మరోసారి పరిశీలించి ట్రాక్ పై నుంచి రాకపోకలను పునరుద్ధరించారు.
Share