Current Date: 04 Jul, 2024

ఇంటికి వీడియో కాల్ చేసి ఏడ్చేసిన విరాట్ కోహ్లీ

టీమిండియా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడడంతో భారత ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. దాదాపు ఆటగాళ్లందరూ భావోద్వేగానికి గురయ్యారు. ఆనంద బాష్పాలు కార్చారు. ఇక పరుగుల యంత్రం, కింగ్ విరాట్ కోహ్లీ కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఈ మ్యాచ్‌లో 76 పరుగులు బాది టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన విరాట్.. ఇదే చివరి టీ20 వరల్డ్ కప్ అని ప్రకటించాడు. అనంతరం మైదానంలో బాగా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు చెమర్చాడు. అంతేకాదు తన  భార్య అనుష్క శర్మ, పిల్లలతో మాట్లాడేందుకు వీడియో కాల్ చేశారు. మాటలు ఆడలేక  వీడియో కాల్ చేసిన వెంటనే విరాట్ ఏడ్చేశాడు.

Share