Current Date: 05 Oct, 2024

ఆదివాసీ మహిళలతో నృత్యం చేసిన సీఎం చంద్రబాబు

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసిన సీఎం అనంతరం డప్పు వాయించారు. ఆ తర్వాత గిరిజన ఉత్పత్తులను పరిశీలించారు. ప్రజాప్రతినిధులతో కలిసి అరకు కాఫీ ఉత్పత్తులను పరిశీలించి కాఫీ రుచి చూశారు. అరకు కాఫీ మార్కెటింగ్ తదితర అంశాలపై అధికారులతో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

Share