Current Date: 06 Oct, 2024

నోరుజారిన టీడీపీ ఎమ్మెల్యే ఆడేసుకుంటున్న నెటిజన్లు

టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదంలో చిక్కుకున్నారు. బాహాటంగా పేకాట క్లబ్బుల్ని తెరిపిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అనంతపురం అర్బన్  స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే   అనంతపురం ఆఫీసర్స్ క్లబ్‌లో పేకాట ఆడిస్తాననని  పేకాట ఆడకపోవడం వల్ల కరోనా సమయం లో 22 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారని వ్యాఖ్యానించారు.అనంతపురం మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా చాలా క్లబ్బులు మూతపడ్డాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్లబ్బుల్లో పేకాట ఆడేందుకు కృషి చేస్తానన్నారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. పేకాట వంటి జూదాన్ని ప్రోహత్సహిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెలే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని కాదని వెంకటేశ్వర ప్రసాద్‌కు టికెట్ ఇచ్చారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇలా మాట్లాడటంపై దుమారం రేగింది.

Share