Current Date: 06 Oct, 2024

కేరళ విషాదం 143కి చేరిన మృతుల సంఖ్య

కేరళలోని వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 143 మంది చనిపోయినట్లు కేరళ వైద్యారోగ్య శాఖ బుధవారం ఉదయం తెలిపింది. ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు 130 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దాదాపు 100 మంది ఆచూకీ తెలియలేదు. వయనాడ్లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నన్నారు

Share