టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ తనపై వస్తున్న 'గోటీల ఫ్యాక్టరీ' పుకార్లపై మరోసారి సరదాగా స్పందించారు. గతంలో ఆయనకు బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల్లో గోటీల వ్యాపారం ఉందని, నెలకు రూ.3 కోట్లు సంపాదిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలపై ఆయన తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తాజాగా జీ తెలుగు 'ఆట' డ్యాన్స్ షోలో పాల్గొన్న ఆయన, తనకు గోటీల ఫ్యాక్టరీ ఉన్న మాట నిజమేనని, అయితే అది కేవలం యూట్యూబ్లోనే ఉందని చెబుతూ అందరినీ నవ్వించారు. ఆ ఫ్యాక్టరీ ద్వారా నెలకు రూ.3 కోట్ల ఆదాయం వస్తోందని ప్రచారం జరుగుతోందని, కానీ ఆ ఫ్యాక్టరీ ఎక్కడుందో తెలిస్తే తానే వెతుక్కుంటూ వెళ్తానని రాజశేఖర్ పంచ్ వేశారు. ఇక సినిమాల విషయానికొస్తే, రాజశేఖర్ ఇటీవల 'బైకర్' చిత్రంలో శర్వానంద్కు తండ్రిగా నటించి తన సెకండ్ ఇన్నింగ్స్ను ఘనంగా ప్రారంభించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తూనే, మరోవైపు సోలో హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తనపై వచ్చే రూమర్లను ఎంజాయ్ చేస్తూనే, వరుస సినిమాలతో రాజశేఖర్ బిజీగా గడుపుతున్నారు.