Current Date: 14 Mar, 2025

దేశంలో పట్టాలెక్కబోతున్న తొలి హైడ్రోజన్ రైలు...

భారతీయ రైల్వేశాఖ సరికొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటివరకు డీజిల్, విద్యుత్ రైళ్లు నడుస్తుండగా.. హైడ్రోజన్‌తో నడిచే తొలి రైలు అందుబాటులోకి రాబోతోంది. దానిలో భాగంగా.. దేశంలోనే తొలి హైడ్రోజన్‌ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 31 నాటికి హర్యానాలోని జింద్‌- సోనిపట్‌ మార్గంలో పరుగులు తీసేలా చర్యలు తీసుకుంటోంది. రీసెర్చ్‌, డిజైన్‌, స్టాండర్డ్‌ అనే సంస్థ భారతదేశపు తొలి హైడ్రోజన్‌ శక్తితో నడిచే రైలు డిజైన్‌ను రూపొందించింది. ఇది రైలు రవాణాలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఈ రైలులో హైడ్రోజన్‌ సిలిండర్లను నిల్వ చేసేందుకు, ఇంటిగ్రేటెడ్‌ ఫ్యూయల్‌ సెల్‌ కన్వర్టర్లు, ఎయిర్‌ రిజర్వాయర్‌లను ఉంచేందుకు మూడు ప్రత్యేక కోచ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు.

Share