భారతీయ రైల్వేశాఖ సరికొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటివరకు డీజిల్, విద్యుత్ రైళ్లు నడుస్తుండగా.. హైడ్రోజన్తో నడిచే తొలి రైలు అందుబాటులోకి రాబోతోంది. దానిలో భాగంగా.. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 31 నాటికి హర్యానాలోని జింద్- సోనిపట్ మార్గంలో పరుగులు తీసేలా చర్యలు తీసుకుంటోంది. రీసెర్చ్, డిజైన్, స్టాండర్డ్ అనే సంస్థ భారతదేశపు తొలి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు డిజైన్ను రూపొందించింది. ఇది రైలు రవాణాలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఈ రైలులో హైడ్రోజన్ సిలిండర్లను నిల్వ చేసేందుకు, ఇంటిగ్రేటెడ్ ఫ్యూయల్ సెల్ కన్వర్టర్లు, ఎయిర్ రిజర్వాయర్లను ఉంచేందుకు మూడు ప్రత్యేక కోచ్లను అధికారులు ఏర్పాటు చేశారు.
Share