Current Date: 05 Oct, 2024

ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం అలవోక విజయం

ఒలింపిక్స్‌లో ఆదివారం భారత అథ్లెట్లు అదరగొట్టేస్తున్నారు. తాజాగా తొలి రౌండ్‌లో పీవీ సింధు విజయం సాధించింది.పారిస్‌ ఒలింపిక్స్‌ను భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి అబ్దుల్‌ రజాక్‌పై అలవోకగా విజయం సాధించింది. సింధుకు రజాక్‌  ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. వరుస గేమ్‌ల్లో సింధు గెలిచింది. కేవలం 29 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌ను సింధు 21-9, 21-6 తేడాతో విజయం సాధించింది.

Share