Current Date: 05 Oct, 2024

తాటి ముంజలు కొడుతూ పాల్‌ ప్రచారం .. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎస్‌కోట ఎగబడ్డ జనం

కేఏ పాల్‌ ఏ పని చేసినా జనం వింతగానే చూస్తారు. ఇప్పుడు ఆయనో సెలబ్రిటీ అయిపోయారు. ఇటీవల విశాఖలో కుండలు తయారు చేస్తున్న కుమ్మరి వద్దకు వెళ్లి కర్ర తిప్పుతూ కేఏ పాల్‌ వార్తల్లోకి ఎక్కారు. ఎన్నికల కమిషన్‌ కూడా ఆయనకు కుండ గుర్తు కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా కేఏ పాల్‌ బుధవారం ఎస్‌కోటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం అక్కడి కల్లు గీత కార్మికుల్ని కలుసుకుని వారి కష్టాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత తాటి ముంజలు కొడుతూ ఫొటోలకు ఫోజిచ్చారు. ప్రజా శాంతి పార్టీ తరఫున ఆయన విశాఖ ఎంపీగానూ, గాజువాక ఎమ్మెల్యేగానూ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలంటూ ఎస్‌కోట వాసుల్ని కేఏ పాల్‌ అభ్యర్థించారు.