Current Date: 04 Jul, 2024

ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ తొలి ‘మన్ కీ బాత్’...మరికాసేట్లో..

ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ ఏం చెప్పబోతున్నారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రతి నెల చివరి ఆదవారం ఉదయం 11.00 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఫిబ్రవరి 25న చివరి మన్‌ కీ బాత్ కార్యక్రమం జరిగింది. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మూడు నెలల పాటు ప్రధాని..మన్ కీ బాత్‌కు విరామం ఇచ్చారు. తాజాగా ఆయన దేశప్రజలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ మొదలు పెడుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. సమాజ హితం కోసం ఉమ్మడి కృషి అవసరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

Share