Current Date: 04 Jul, 2024

భారత క్రికెట్ టీం చరిత్ర సృష్టించిందన్న సీఎం చంద్రబాబు..

రెండవ సారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. భారత క్రికెట్ టీం చరిత్ర సృష్టించిందని, భారత జట్టుకు, సపోర్టింగ్ స్టాఫ్‌కు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత టి20 వరల్డ్ కప్పు భారత్ సాధించిందని, ఈ విజయం భారత ప్రజలను సంతోషం, ఆనందాన్ని పంచిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇక భారత క్రికెట్ జట్టు ఈరోజు ఒక అద్భుతమైన విజయాన్ని సాధించిందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రోహిత్ సేన చరిత్ర సృష్టించిందని, తీవ్రమైన ఒత్తిడిలో కూడా సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ మ్యాచ్‌ను గెలిపించిందన్నారు. దేశం మొత్తం మిమ్మల్ని చూసి గర్విస్తోందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

Share