Current Date: 05 Oct, 2024

జార్ఖండ్లో రైలు ప్రమాదం


జార్ఖండ్లోని చక్రధర్పూర్కు సమీపంలో ముంబై వెళ్తున్న హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఆగ్నేయ రైల్వేపరిధిలోని రాజఖర్సావాన్, బడాబాంబో స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 3:45గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టు  తెలుస్తోంది. 18 బోగీలు పట్టలు తప్పాయి.ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా సుమారు 60మంది గాయపడినట్టు సమాచారం. డౌన్ లైన్ నుంచి వస్తున్న ఓ గూడ్స్ రైలును హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ ఢీకొట్టడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Share