Current Date: 05 Oct, 2024

ఢిల్లీ లోనూ జగన్ కు అ శాంతి

ఢిల్లీలో  బుధవారం యుద్ధం జరగబోతుందా ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోనుందా సాయిరెడ్డే శాంతి బిడ్డ కు తండ్రి అని పోరాడుతున్న మదన్ , ఏపీ లో హత్యలకు నిరసనగా దీక్ష చేపడుతున్న జగన్‌ వర్గీయుల మధ్య  ఢిల్లీ వేదికగా పోటా పోటీ దీక్షలు రక్తి కట్టించనున్నాయి .దేవదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ శాంతి కుటుబానికి అన్యాయం చేసినట్టు ఆరోపణలు ఎదురుకుంటున్న విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ శాంతి భర్తతో పాటు విజయసాయిరెడ్డి బాధితులు జంతర్‌మంతర్‌లో నిరసన చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఇప్పటి కే శాంతి పూర్వపు భర్త మదన్ తన మిత్రులతో ఢిల్లీ చేరు కున్నారు. నాభార్య శాంతి బిడ్డకు తండ్రి ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం కావాలి అంటూ  మదన్ ఢిల్లీ లో డిమాండ్ చేయడానికి సిద్ధమయ్యారు. విజయసాయిరెడ్డి పై ఆరోపణలున్నాయి కాబట్టి ఆయన డిఎన్‌ఏ టెస్ట్‌కు సిద్ధం కావాలని  మదన్  డిమాండ్ చేయబోతున్నట్టు తెలిసింది. ఇదే అదనుగా సాయిరెడ్డి బాధితులు కూడా మదన్ తో చేతులు కలిపి ధర్నాకు దిగుతున్నారు.తమ డిమాండ్‌కు అన్నిపార్టీల మద్ధతునూ మదన్ కోరుతున్నారు. డిఎన్‌ఏ టెస్ట్‌కు సిద్ధం కాకపోతే విజయసాయిరెడ్డిని పార్టీనుంచి సస్పెండ్‌ చెయ్యాలని వీరుకోరనున్నట్లు తెలుస్తోంది

Share