Current Date: 06 Oct, 2024

బెయిల్‌ను మరో వారం పొడిగించాలని సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్....

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్‌ను 7 రోజులు పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యంతో బాధపడుతున్నారని అందుకే పొడిగించాలని చెప్పారు. తనను అరెస్ట్ చేసిన తర్వాత బరువు 7 కిలోలు తగ్గానని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఉన్నాయన్నారు. అందుకే తాను పీఈటీ-సీటీ స్కాన్ సహా పలు పరీక్షలు చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో టెస్టులు చేయించుకోవడానికి మరో 7 రోజులు గడువు కావాలని సుప్రీంకోర్టును కోరారు.