Current Date: 06 Oct, 2024

కీరవాణి స్టూడియోకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి...

తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణకు సంగీతం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి  ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణిని  కోరుతూ.. రాయదుర్గంలోని కీరవాణి స్టూడియోకి వెళ్లారు.తెలంగాణ రాష్ట్ర గేయం రికార్డింగ్ పూర్తయిన నేపథ్యంలో... మరోసారి మార్పులు, చేర్పులపై కీరవాణితో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు చేశారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో, ఈ గీతాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతుల మీదుగా విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే వీలైనంత త్వరగా పాటకు ఫైనల్ మిక్సింగ్ చేయాలని కీరవాణి భావిస్తున్నారు.