Current Date: 05 Oct, 2024

తిరుపతిలో ఫ్రెండ్‌ని భర్తతో రేప్ చేయించిన భార్య

తనను నమ్మి వచ్చిన ఫ్రెండ్‌‌ని భర్తతో ఓ భార్య అత్యాచారం చేయించిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. సదాశివం ప్రణవ్ క్రిష్ణ అనే మహిళ తన స్నేహితురాలిపై తన భర్తతోనే అత్యాచారం చేయించింది. సదాశివం ప్రణవ్ క్రిష్ణరెడ్డి తిరుపతిలో తనతో పాటు చదువుతున్న ఒక మహిళను తన ఇంటికి తీసుకు వెళ్లింది. ఆమె తన భర్త వెంకిరెడ్డి క్రిష్ణకిషోర్ రెడ్డి కలిసి ఆ మహిళను మాటల్లో పెట్టి  కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చింది. స్నేహితురాలు మైకంలో ఉన్నపుడు తన భర్తతో అత్యాచారం చేయించింది. దాన్ని వీడియో, ఫోటోలు తీసి సదరు మహిళ అన్నకు, ఆమెకు కాబోయే భర్తకు పంపి నిందితులు డబ్బులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై బాధితురాలు తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసి, వెంటనే స్పందించి నిందితులైన భార్యాభర్తలను అరెస్ట్ చేశారు.

 

 

 

 

Share