Current Date: 05 Oct, 2024

విశాఖ బీచ్‌లో ఘనంగా ‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌’

పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించిన సందర్భంగా అన్ని చోట్లా కార్గిల్‌ యుద్ధ వీరులకు వందనాలందాయి. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని విశాఖ బీచ్‌ రోడ్డులో స్తూపం వద్ద భారత నావికాదళ సిబ్బంది సహా పలువురు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్‌ యుద్ధంలో భారత సైనికులు వెరవకుండా వెన్ను చూపిన సైనిక సత్తాకు సెల్యూట్‌ చేశారు. దేశ రక్షణకు తామంతా నిబద్ధులై ఉంటామని హామీ ఇస్తూనే యుద్ధంలో అమరులైన వారందరికీ సైనికా వందనం అంటూ నినదించారు. అమరుల కుటుంబాలకు అండగా ఉందామని ప్రతిన బూనారు. సరిహద్దుల్లో ఎండనక, వాననకా కాపలా కాస్తూ భారత భూభాగాన్ని కంటికి రెప్పలా కాస్తున్న సైనికుల సేవల్ని కూడా పలువురు కొనియాడారు.

Share