హోలీ రోజున ఉత్తర భారతం వణికిపోయింది. హిమాలయ ప్రాంతంలో తెల్లవారుజామున భూకంప ప్రకంపనలు సంభవించాయి. లడఖ్లోని కార్గిల్లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు తెల్లవారుజామున 2.50 గంటలకు సంభవించాయి. కార్గిల్తోపాటు, ఈ ప్రకంపనలు లడఖ్ అంతటా జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంప కేంద్రం 15 కిలోమీటర్ల లోతులో ఉందని జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. ఈ భూకంపం వచ్చిన మూడు గంటలకే, ఈశాన్య భారతదేశంలో కూడా ప్రకంపనలు సంభవించాయి. అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ కామెంగ్ ప్రాంతంలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 6 గంటలకు ఇక్కడ భూకంపం సంభవించింది. మార్చి 13న మధ్యాహ్నం 2 గంటలకు టిబెట్లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Share