Current Date: 05 Oct, 2024

వైసీపీకి మరో షాక్‌ జనసేనలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే దొరబాబు!

కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్లు తెలిసింది.  బుధవారం పవన్‌కల్యాణ్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరేందుకు దొరబాబు ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నట్టు తెలిసింది.  దొరబాబుతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా వైసీపీని వీడబోతున్నారని సమాచారం. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెండెం దొరబాబు వైసీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు.  2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఆయనకు కాకుండా వంగా గీతకు వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చింది. అప్పటి నుండి దొరబాబు  పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఎన్నికల ముందు దొరబాబుకు వైసీపీ అధిష్టానం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని హామీ ఇచ్చి తరువాత మాట తప్పింది.

Share