Current Date: 05 Oct, 2024

వినేష్ ఒలింపిక్స్ నుంచి అవుట్

పారిస్ ఒలింపిక్స్ లో ఇండియాకు షాక్! స్వర్ణం లేదా గ్యారంటీ రజతం అనుకున్న రెజలర్ వినేష్ పై అనర్హత వేటు పడింది. 100 గ్రాముల బరువు అధికంగా ఉండటంతో ఆమెను 50 కిలోల విభాగం నుంచి పోటీకి అనర్హురాలు గా ప్రకటించారు. ఇప్పటికే 50 కిలోల విభాగంలో ఫైనల్ కు చేరిన విషయం తెలిసిందే. ఇవాళ రాత్రి 11 గంటలకు తుది పోటీ ఉండగా, నిన్న సెమీ ఫైనల్ లో వినేష్ పై ఓడిన క్యూబా రెజలర్ చేసిన ఫిర్యాదు మేరకు ఇవాళ మళ్ళీ ఆమె బరువు పరీక్షించారు. 50 కిలోల కన్నా వంద గ్రాములు ఎక్కువగా ఉండటం తో అనర్హత వేటు వేశారు. నిజంగా దురదృష్టకరం, విచారకరం. కేంద్రం స్పందించింది. అత్యవసర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒలింపిక్స్ కమిటీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Share