Current Date: 11 Oct, 2024

తిరుమలలో వైభవంగా రథోత్సవం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం మహా రధోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో రథంపై విహరించారు. రథోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు జగత్‌ రక్షుకుడైన శ్రీవారిని దర్శించుకుని గోవింద నామస్మరణల మధ్య రథాన్ని లాగి తరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల పర్వంలో శుక్రవారం రాత్రి స్వామివారు అశ్వ వాహనంపై కల్కి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీంతో వాహన సేవలు పూర్తి కానున్నాయి. శనివారం చివరి ఘట్టమైన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు.  మరోవైపు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 

Share