Current Date: 05 Oct, 2024

జగన్‌ను మళ్లీ షర్మిల టార్గెట్ డబుల్ డోస్!

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన సభకు హాజరు కాకపోవడం పిరికితనం, చేతగానితనం, అహంకారం వల్లే అని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు, ఆఫీసుకు పోననే పనిదొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు. ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్టికా మంచులోకే పోతారో ఎవడికి కావాలి అప్పుడు. అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి షర్మిల డిమాండ్ చేసింది.

Share