Current Date: 05 Oct, 2024

ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ ప్రీక్వార్టర్స్‌లో తొలి భారతీయురాలు

ఒలింపిక్ గేమ్స్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్ మరియు హోమ్ ఫేవరెట్ ప్రితికా పవాడేపై 4-0 తేడాతో విజయం సాధించి, మణికా బాత్రా సింగిల్స్ ప్రీక్వార్టర్‌ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 29 ఏళ్ల మణికా 11-9, 11-6, 11-9, 11-7తో విజయం సాధించి, 32వ రౌండ్‌ను అధిగమించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది.  మ్యాచ్ తర్వాత, మణికా PTIతో మాట్లాడుతూ, "ఫ్రెంచ్ ప్లేయర్‌పై విజయం సాధించడం సంతోషంగా ఉంది. చరిత్ర సృష్టించాలి అని నేను అనుకోలేదు, కానీ నా బెస్ట్ ఇస్తాను" అన్నారు.

Share