Current Date: 06 Oct, 2024

ప్రసాద్‌ ల్యాబ్‌లో హై డ్రామా

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ గత కొన్నాళ్లుగా ఓ వివాదంలో ఉన్న సంగతి తెలిసిందే. లావణ్య అనే యువతి రాజ్‌తరుణ్‌ పై కేసు పెట్టింది. రాజ్‌తరుణ్‌తో పదేళ్లకు పైగా కలిసి జీవించానని, హీరోయిన్‌ మాల్కి మల్హోత్రాని వివాహం చేసుకోబోతున్నాడని ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే రాజ్‌తరుణ్‌కు నోటీసులు పంపారు. ఈ విషయం పై రాజ్‌తరుణ్‌ ఓ సారి స్పందించాడు. ఆమెతో తనకు బ్రేకప్‌ అయిందని, ఆమె చెప్పేవన్ని నిజం కాదన్నాడు. ఆ తరువాత ఫోన్‌ నంబర్‌ మార్చేసి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. మరోవైపు మాల్వి మల్హోత్రా కూడా లావణ్యపై కేసు పెట్టింది. కాగా  రాజ్‌ తరుణ్‌ హీరోగా చేసిన తిరగబడరా సామీ సినిమా ఆగస్టు 2న విడుదల కాబోతుంది. ఈ రోజు ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ప్రెస్‌ మీట్‌ హైదరాబాద్‌ లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌ లో ఏర్పాటు చేసారు. ఈ ప్రెస్‌ మీట్‌కి రాజ్‌ తరుణ్‌, హీరోయిన్‌ మాల్వి మల్హోత్రి కూడా వస్తారని సమాచారం వచ్చింది. లావణ్య విషయంపై రాజ్‌తరుణ్‌ స్పందిస్తాడా..? లేక సినిమా గురించి మాత్రమే మాట్లాడతాడా అని ఎదురుచూస్తుండగా ప్రసాద్‌ ల్యాబ్‌కు పోలీసులు చేరుకున్నారు. 

Share