Current Date: 06 Jul, 2024

Another mega hero for Pithapuram to support Pawan!

పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా ప్రచారం చేసేందుకు పిఠాపురానికి మరో మెగా హీరో రాబోతున్నాడు. ఇప్పటికే జబర్దస్త్ ఆర్టిస్టులు, గబ్బర్ సింగ్ గ్యాంగ్, పలువురు సినీ నటులు పవన్ కళ్యాణ్ తరఫున పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. 
వారితో పాటు మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా జనసేనాని కోసం ప్రచారంలోకి దిగారు. తాజాగా మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఈ జాబితాలో చేరారు. పవన్ కళ్యాణ్ తరఫున సాయి తేజ్ ప్రచారానికి రెడీ అయ్యారు.

గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పవన్ కళ్యాణ్ ఓడిపోవడంతో ఈ ఎలక్షన్‌ను మెగా ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ జనసేనానిని అసెంబ్లీకి పంపాలనే ఉద్దేశంతో జోరుగా ప్రచారం చేస్తుంది. గతంలో రెండు స్థానాల్లో పోటీ చేసిన పవన్ ఈసారి కేవలం పిఠాపురం నుంచే బరిలోకి దిగుతున్నారు. ఈ స్థానం నుంచి లక్షకి పైగా మెజార్టీతో పవన్ గెలుస్తారంటూ జనసేన ధీమాగా ఉంది.

మరోవైపు అధికార వైసీపీ నుంచి వంగా గీత విశ్వనాథ్ బరిలో ఉన్నారు. లక్ష మెజార్టీ మాట పక్కన పెట్టి అసలు పవన్ గెలిచే అవకాశమే లేదంటూ వంగా గీత ప్రచారం చేస్తున్నారు. అయినా లక్ష మెజార్టీ వస్తుందని అంత ధీమాగా చెప్పేటప్పుడు ఇంత మంది సెలబ్రెటీలను పిఠాపురంలో మకాం వేయించాల్సిన అవసరం ఏముందంటూ వంగా గీత ప్రశ్నిస్తున్నారు.