Current Date: 05 Oct, 2024

ఏపీలో మాజీ మంత్రి అరెస్ట్‌కి రంగం సిద్ధం ఇదిగో సంకేతం!

ఏపీలో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌కి రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు  చంద్రబాబు నివాసంపై దాడి కేసులో  ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన పేరు ఉండటంతో  ముందస్తు బెయిల్ కోసం జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు.2021 సెప్టెంబర్‌లో  జోగి రమేష్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారు. కోడెల శివప్రసాద్ వర్ధంతి నాడు అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డిని కించ పరిచారని ఆయనతో చంద్రబాబే వ్యాఖ్యలు చేయించారని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జోగి రమేష్ పెద్ద ఎత్తున కార్లతో చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ నేతలు కూడా రావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అక్కడకు వచ్చిన బుద్దా వెంకన్నకు గాయాలయ్యాయి. ప్రతిపక్ష నేత ఇంటిపై ఇలా అధికార పార్టీ నేత దాడికి రావడంతో అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే పోలీసులు ఎవరిపైనా కేసులు పెట్టలేదు. టీడీపీ నేతలపై మాత్రం కేసులు పెట్టారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడం ఆ కేసును రీఓపెన్ చేశారు. ఇందులో నిందితుడిగా జోగి రమేష్ ను చేర్చారు. 

Share