Current Date: 04 Oct, 2024

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం సీఎం చంద్రబాబు

తిరుమల లడ్డూ వివాదంపై స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను  స్వాగతిస్తున్నట్లు  ఏపీ సీఎం చంద్రబాబు  చెప్పారు.    ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. ‘‘తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై సీబీఐ, ఏపీ పోలీస్‌, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సభ్యులతో సిట్‌ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ‘సత్యమేవ జయతే’, ‘ఓం నమో వేంకటేశాయ’’’ అని సీఎం పేర్కొన్నారు. కాగా, టీటీడీ మాజీ చైర్మన్‌ కరుణాకరరెడ్డి, పలువురు వైసీపీ నాయకులు కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు.

Share