Current Date: 05 Oct, 2024

విభజన అంశాలపై చర్చ ..అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో సీఎంల సమావేశంలో  చర్చించాల్సిన అంశాలపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బి.సి.జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్‌ పాల్గొన్నారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్‌ కుమార్‌తో పాటు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు.

Share