Current Date: 05 Oct, 2024

అతిప్రేమతో తల్లిని గొంతునులిమి చంపిన కొడుకు

 తాను చనిపోతే తల్లి బాగోగులు చూసుకనేవారు ఎవరూ ఉండరని భావించి ఆమెను హత్య చేసి ఓ కొడుకు  తాను ఆత్మహ్యత చేసుకున్నాడు. ఈ ఘటన కొత్తగూడెం జిల్లా బూడిదగడ్డలో చోటు చేసుకుంది.   తుల్జా కుమారికి (55) కుమారుడు వినయ్ ఒక్కడే సంతానం. పదేళ్ల క్రితం కుమారి భర్త చనిపోయాడు. అప్పట్నుంచి తల్లి,కుమారుడు మాత్రమే ఇంట్లో కలిసి ఉంటున్నారు. అయితే గత రెండేళ్లుగా కుమారి ఆరోగ్యం బాగుండటం లేదు. తరుచూ అనారోగ్యం బారినపడుతున్నారు. తల్లికి చికిత్స చేయించేందుకు వినయ్ తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. అయితే ఆర్థిక సమస్యలతో వినయ్ మానసికంగా కుంగిపోయాడు. ఇటీవల అతడికీ ఓ జబ్బు వచ్చింది. దీంతో వినయ్ మరింతగా కుంగిపోయాడు.   'నాకు బతకాలని లేదు. నేను లేకపోతే అమ్మకు తోడెవరు?’ అని వినయ్ తనలో తానే మాట్లాడుకునేవాడు. ఈక్రమంలోనే అర్ధరాత్రి తల్లి కుమారిని వినయ్ హత్య చేశాడు. ఇంట్లోనే గొంతు నులుమి ఆమెను చంపేశాడు. ఆపై తాను కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం తలుపులు తెరవకపోటవంతో చుట్టుపక్కల వాళ్లు అనుమానంతో పగులగొట్టి చూడగా.. కుమారి విగతజీవిగా పడి ఉంది. వినయ్ కూడా ఊరేసుకొని కనిపించాడు.

Share