Current Date: 05 Oct, 2024

ఏపీకి ఐపీఎస్‌ కేడర్‌ స్ట్రెంత్‌ పెంపు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఐపీఎస్‌ కేడర్‌ స్ట్రెంత్‌ను పెంచుతూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రస్తుతం 144గా ఉన్న ఐపీఎస్‌ కేడర్‌ స్ట్రెంత్‌ను కేంద్రం 174కు పెంచింది. సీనియర్‌ డ్యూటీ పోస్టుల్లో 95 మంది ఐపీఎస్‌లను కేటాయించాలని రాష్ట్రం కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు ఐపీఎస్‌లను పెంచుతూ కేంద్రం నోటిఫికేషన్‌ ఇచ్చింది. కేంద్ర డిప్యుటేషన్‌ రిజర్వ్‌గా 38 మంది ఐపీఎస్‌లను కేటాయించింది. రాష్ట్రాలకు డిప్యుటేషన్‌ రిజర్వ్‌గా 23 మందిని నిర్దేశించింది.

Share