Current Date: 05 Oct, 2024

మహిళల టీ20 ప్రపంచకప్‌ భార‌త జట్టు ప్ర‌క‌ట‌న‌

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ లో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2024కు బీసీసీఐ తాజాగా భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో టీమిండియా ఈ మెగా ఈవెంట్‌లో బ‌రిలోకి దిగ‌నుంది. ఈ జ‌ట్టుకు వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధానను ఎంపిక చేసింది బోర్డు.  కాగా, ఈ తొమ్మిదో ఎడిషన్ టోర్నమెంట్ అక్టోబర్ 3 నుండి 20 వరకు యూఏఈలోని దుబాయ్, షార్జా వేదిక‌ల్లో జరగనుంది. గ్రూప్-ఏలో భార‌త్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఉన్నాయి.

Share