Current Date: 06 Oct, 2024

మహా విషాదం.. 2వేలు దాటిన మరణాలు

ఇండోనేషియాకు సమీపంలో ఉండే పపువా న్యూగినియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణాలసంఖ్య2వేలుదాటింది.శుక్రవారం తెల్లవారుజామున భారీగా కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో మరణాలు 2 వేలు దాటినట్లు ఆ దేశం ఐక్యరాజ్య సమితికి నివేదిక సమర్పించింది.భారీగా నష్టం వాటిల్లిందని, ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు సహాయక చర్యలుకొనసాగుతున్నాయి.కొండలను ఆనుకొని గ్రామాలు ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది.