Current Date: 05 Oct, 2024

సెల్ఫీ తీసుకుంటూ లోయలోకి జారిన యువతి.. జస్ట్‌మిస్

సెల్ఫీ మోజులో ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు వరుసగా జరుగుతున్నా.. ఎవరూ కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని పర్యాటక ప్రదేశం బోరాన్‌ ఘాట్‌లో ఓ యువతి సెల్ఫీ తీసుకుంటూ ఏమరపాటులో లోయలోకి జారిపడిపోయింది.మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలపాతాలు కళకళలాడి పర్యాటకులు భారీగా పోటెత్తుతున్నారు. పుణెకు చెందిన నస్రీన్‌ అమీర్‌ ఖురేషీ అనే యువతి రోడ్డు అంచున సెల్ఫీ తీసుకొంటూ పట్టు జారి లోయలోకి పడిపోయింది. అయితే వెంటనే స్పందించిన హోంగార్డు స్థానికుల సహాయంతో లోయలోకి దిగి ఆమెను కాపాడారు. దాంతో తృటిలో ఆమెకి ప్రాణాపాయం తప్పింది.. కానీ తీవ్ర గాయాలు అయ్యాయి.
 

Share