Current Date: 05 Oct, 2024

రూ.200 కోసం గొడవ.. చినికి చినికి ప్రాణం తీసింది!

అర్ధరాత్రి రూ.200 కోసం మొదలైన గొడవ.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివేక్‌రెడ్డి అనే వ్యక్తి.. హైదరాబాద్‌లో క్యాబ్‌ బుక్‌ చేసుకున్నాడు. గమ్యం చేరుకున్నాక.. ఛార్జి రూ.900 అయ్యిందని క్యాబ్‌ డ్రైవర్‌ వెంకటేష్‌గౌడ్‌ (27) చెప్పగా.. వివేక్‌రెడ్డి రూ.700 మాత్రమే ఇచ్చాడు. దాంతో మిగిలిన రూ. 200 కోసం గొడవ మొదలైంది.క్షణికావేశంతో వివేక్‌రెడ్డి తన స్నేహితులకు ఫోన్‌ చేసి రప్పించాడు. అప్పటికే మద్యం తాగుతూ ఉన్న సుమారు 20 మంది వచ్చి, వెంకటేశ్‌గౌడ్‌ను క్రికెట్‌ బ్యాట్లు, వికెట్లతో విచక్షణారహితంగా చితకబాదారు. బాధితుడు ప్రాణభయంతో పారిపోతుంటే.. బస్తీలో వెంటాడి మరీ దాడి చేశారు. ఆ తర్వాత పోలీసులకి ఫిర్యాదు చేయగా.. నిందితులను వదిలేసిన పోలీసులు.. వెంకటేష్‌ గౌడ్‌ను స్టేషన్‌లో రాత్రంగా ఉంచారు. దాంతో తీవ్ర గాయాలతో ఉదయానికి వెంకటేష్‌ గౌడ్‌ ఉదయానికి కోమాలోకి వెళ్లిపోయాడు.

Share