Current Date: 06 Oct, 2024

వేణుస్వామికి గొప్ప ఊరట ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్‌లకే అక్షింతలు

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా వివాదాలకి కేరాఫ్ అడ్రస్‌గా మారిన జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ హైకోర్టులో గొప్ప ఊరట లభించింది. నాగచైతన్య- శోభితా ధూళిపాళ నిశ్చితార్థం తర్వాత వారు విడిపోతారని జోస్యం చెప్పిన వేణుస్వామిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. వేణుస్వామిపై ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ ఫిర్యాదు చేయడంతో మహిళా కమిషన్‌ నోటీసులని కూడా వేణుస్వామికి జారీ చేసింది.ఈ నోటీసులపై వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. దాంతో విచారణ జరిపిన ధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులు చెల్లవంటూ హైకోర్టు తేల్చి చెప్పేసింది. అలానే వేణుస్వామిపై ఫిర్యాదు చేసిన ఫిలిం జర్నలిస్టులకు కూడా గట్టిగానే మొట్టికాయలు వేసింది. నాగచైతన్య-శోభితా ధూళిపాలకు లేని సమస్య మీకెందుకు?' అంటూ ఫిలిం జర్నలిస్టులు, మహిళా కమిషన్‌ను సూటిగా హైకోర్టు ప్రశ్నించింది. అయితే నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఒకరి వ్యక్తిగత విషయాలపై వారి అనుమతి లేకుండా సోషల్ మీడియాలో తన పాపులారిటీ కోసం వేణు స్వామి తప్పుడు వ్యాఖ్యలు చేశాడంటూ విమర్శిస్తున్నారు. 

Share