Current Date: 07 Oct, 2024

శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు జడ్జితో విచారణ జరపాలి ` బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌ రెడ్డి డిమాండ్‌

ప్రపంచ హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలను గత ప్రభుత్వం అధర్మ క్షేత్రంగా మార్చిందని బీజేపీ  రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌ రెడ్డి ఆరోపించారు. దర్శన టికెట్లు, లడ్డూ ప్రసాదాలు, ఇంజినీరింగ్‌ పనులంటిన్నింటిలోనూ అవినీతి చేశారని విమర్శించారు. ఆయన శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం  మీడియాతో మాట్లాడారు. టీటీడీలో శ్రీవారి ఆభరణాలు భద్రమేనా? అనే అనుమానాలు భక్తులకు ఉన్నాయన్నారు. వైసీపీ హయాంలో రూ.వందల కోట్లు కమిషన్ల రూపంలో దండుకున్నారని ధ్వజమెత్తారు. శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో కమిటీ వేసి విచారణ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Share