Current Date: 28 Sep, 2024

హీరోయిన్ రష్మిక మందనాకి యాక్సిడెంట్ కానీ క్లారిటీ ఇవ్వని భామ

హీరోయిన్ రష్మిక మందన యాక్సిడెంట్ అయ్యింది. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదని..  వైద్యుల సూచన మేరకు రెస్ట్ తీసుకుంటున్నానని ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇచ్చింది."నేను పబ్లిక్‌లో కనిపించి, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండి చాలా రోజులైపోయింది. అయితే చిన్న ప్రమాదం జరగడం వల్లే ఆగస్టు నెలలో నేను అంత యాక్టివ్‌గా ఉండలేకపోయాను. ఇప్పుడు అంతా సర్దుకుంది. ప్రస్తుతం సూపర్‌ యాక్టివ్‌గా ఉన్నా. నేను మీకు చెప్పేది ఒక్కటే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం ఎప్పుడూ ముఖ్యం. ఎందుకంటే జీవితం చిన్నది. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అందుకే ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి." అంటూ రష్మిక పోస్ట్ చేసింది.అయితే అసలు ప్రమాదం ఎక్కడ జరిగింది ఏంటి అనే వివరాలు మాత్రం రష్మిక ఎక్కడా చెప్పలేదు. ఇక కెరీర్ విషయానికొస్తే పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్ అందుకున్న రష్మిక వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేస్తుంది. గతేడాది యానిమల్ చిత్రం కూడా సూపర్ హిట్ కావడంతో రష్మిక క్రేజ్ ఇంకా పెరిగింది. ఇప్పుడు 'పుష్ప 2' కోసం ఆమె ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 6న ఈ సినిమా విడుదల కానుంది.

Share