Current Date: 22 Sep, 2024

అన్న క్యాంటీన్ ప్రారంభించిన స్పీకర్

నర్సీపట్నంలో అన్న క్యాంటీన్ బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణన్ ప్రారంభించారు. అనంతరం క్యాంటీన్లోనే వారు భోజనం చేశారు. హరే రామ హరే కృష్ణ సంస్థ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారితోపాటు 26వ వార్డు కౌన్సిలర్ అయ్యన్న సతీమణి పద్మావతి,  25 వ వార్డు కౌన్సిలర్, అయ్యన్న తనయుడు రాజేష్ , ఆర్డీవో జయరాం ,మున్సిపల్ కమిషనర్ సురేంద్ర,  జనసేన నియోజకవర్గ ఇన్చార్జి రాజన సూర్యచంద్ర తదితరులు అన్నా క్యాంటీన్లోనే భోజనం చేశారు.

Share