Current Date: 06 Jul, 2024

విశాఖ ఏజన్సీలో హృదయ విధారకరం

 విశాఖ ఏజన్సీలో హృదయ విధారకరమైన సంఘటన చోటు చేసుకుంది. హుకుంపేట మండలదుర్గం పంచాయితీ, తోటకూరపాడు గ్రామంలో పిడుగుపడి జంతుజాలం మృత్యువాత పట్టింది. అకాల వర్షంతో పాటు పిడుగు పాటుకు గురైపాంగి కళ్యాణ్ అనే వ్యక్తికి చెందిన దుక్కిటెద్దులు (రెండు), 8మేకలు మృతి చెందాయి. అదే విధంగా పాంగి అప్పారావుకు చెందిన దుక్కిటెద్దులతో పాటు మరో రెండు మేకలు, 
పాంగి చిన్నారావుకు చెందిన ఐదు మేకలూ అక్కడికక్కడే మృతి చెందాయి, వ్యవసాయ పనులు ప్రారంభ సమయంలోనే దుక్కిటెద్ధులు చనిపోవడంతో ఆ రైతులంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు, మృతి చెందిన జంతు జాలానికి ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని హుకుంపేట వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, ఆయా రైతులు ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.