Current Date: 27 Sep, 2024

కాన్పూర్ చేరుకున్న టీమిండియారేపటి నుంచి రెండో టెస్టు

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు కాన్పూర్ చేరుకుంది. ఇప్పటికే తొలి మ్యాచులో 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత్.. సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. శుక్రవారం నుంచి కాన్పూర్ వేదికగా జరిగే ఈ టెస్టులోనూ గెలిచి.. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ పట్టుదలతో ఉంది.ఎయిర్‌పోర్ట్‌కు చేరిన ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పటిష్ట భద్రత మధ్య వారిని.పోలీసులు టీమిండియా బస చేసే హోటల్‌కు తీసుకెళ్లారు. బంగ్లాదేశ్ జట్టు కూడా కాన్పూర్ చేరుకుంది. ఈ మ్యాచ్ కోసం పోలీసులు సైతం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.కాన్పూర్ పిచ్.. స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఇరు జట్లూ కూడా తమ తుది జట్టులో మార్పులు చేయనున్నాయి. చెన్నై పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని భావించి.. భారత్, బంగ్లాదేశ్‌లు ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాయి. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరగనుంది. ముగ్గురు స్పిన్నర్లు.. ఇద్దరు పేసర్లతో ఇరు జట్లు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి

Share