Current Date: 05 Oct, 2024

హీరో విశాల్‌పై జడ్జి సీరియస్ షూటింగ్ కాదంటూ వార్నింగ్

తమిళ స్టార్‌ హీరో విశాల్‌పై న్యాయస్థానంలో జడ్జి మండిపడ్డారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో గత కొంతకాలంగా విశాల్‌తో వివాదం నడుస్తోం. ఈ నేపథ్యంలో విచారణకి హాజరైన విశాల్.. కోర్టులో‌ ఇచ్చిన సమాధానంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. తాను ఖాళీ కాగితంపై సంతకం చేశానని..  లైకా సంస్థతో అగ్రిమెంట్‌ జరిగిందన్న విషయమే తనకు తెలియదని సమాధానం ఇచ్చాడు. దాంతో విశాల్ వ్యాఖ్యలపై జడ్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివిగా సమాధానం చెబుతున్నారనుకుంటున్నారా? ఇదేం షూటింగ్‌ కాదు. సరిగ్గా బదులివ్వండి అని విశాల్‌కు చీవాట్లు పెట్టారు. విశాల్‌ హీరోగా లైకా ప్రోడక్షన్స్‌ సంస్థ నిర్మాణంలో 'పందెంకోడి 2' మూవీ తెరకెక్కింది. ఈ సినిమా సమయంలో విశాల్‌ లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ వద్ద రూ. 21.29 కోట్లను అప్పుగా తీసుకున్నాడు. అయితే ఆ డబ్బు తిరిగి చెల్లించేంత వరకు తన సినిమా హక్కులను లైకాకే ఇవ్వాలనేది సదరు సంస్థ విశాల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాన్ని విశాల్‌  ఉల్లంఘించాడు.

Share