Current Date: 04 Jul, 2024

ప్రభుత్వ శాఖల్లో రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ బై

ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులందరూ తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం లో రిటైర్డ్ ఉద్యోగులు అనేక మంది వివిధ శాఖల్లో మళ్ళీ ఉద్యోగాలు పొందిన విషయం తెలిసిందే.  అయితే వీళ్ళందరూ రాజీనామా చేయాలని ప్రభుత్వ కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ శాఖల అధికారులకు ఉత్తరువులు జారీ చేశారు.ఒకవేళ వాళ్లు అత్యవసర సర్వీసుల్లో పనిచేస్తున్నా ముందు రాజీనామా చేయించి సంబంధిత అధికారుల అనుమతి ద్వారా మళ్ళీ ఆయా పోస్ట్ లు భర్తీ చేసుకోవాలని ఆదేశించారు.

Share